News January 11, 2025

జగన్‌ను అడ్డుకోవడం దారుణం: బొత్స

image

వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచడమే తప్పు అన్నట్లు చంద్రబాబు మాట్లాడటం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బొత్స మండిపడ్డారు. ‘గతంలో రెండు రోజులే వైకుంఠ దర్శనం ఉండేది. మా ప్రభుత్వంలో 10 రోజులకు పెంచాం. అప్పటి మా సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. గాయపడిన వారిని పరామర్శించడానికి జగన్ వెళ్తే అడ్డుకోవడం ఏంటి. ఇంత కన్నా దారుణం ఎక్కడుంటుంది’ అని బొత్స ప్రశ్నించారు.

Similar News

News January 13, 2026

‘విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదు’

image

రబీ 2025–26 పంట కాలానికి విజయనగరం జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 12,606 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా.. ప్రస్తుతం 2,914 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొంది. అదనంగా 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుంది. రైతులు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని అధికారులు సూచించారు.

News January 13, 2026

15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

image

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

News January 12, 2026

VZM: ‘పీజీఆర్ఎస్‌ని ప్రజలు వినియోగించుకోవాలి’

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.