News March 17, 2024
ఓపెన్ స్కూల్ పరీక్షలు.. ఈనెల 23 వరకు ఛాన్స్

TG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షలకు రూ.500, ఇంటర్కు రూ.1000 చొప్పున ఆలస్య రుసుముతో ఈనెల 18 నుంచి 21 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. డీఈవోల వద్ద ఈనెల 22 వరకు, ప్రధాన కార్యాలయంలో ఈనెల 23 వరకు చెల్లించవచ్చని సూచించారు.
Similar News
News September 8, 2025
ఈవారం ఓటీటీలోకి రెండు బ్లాక్బస్టర్ చిత్రాలు

సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ ఈనెల 11న ఓటీటీలో(అమెజాన్ ప్రైమ్ వీడియో) విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ చిత్రం ఈనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.
News September 8, 2025
మహాలయ పక్షాలు అంటే ఏంటి?

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.
News September 8, 2025
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం(తిరుపతి జిల్లా), శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, మహానంది నందీశ్వర ఆలయం, యాగంటి ఉమా మహేశ్వర ఆలయం(నంద్యాల), ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి(కోనసీమ), అమరేశ్వర స్వామి ఆలయం (అమరావతి), పాలకొల్లు క్షీరారామ ఆలయం, భీమవరం సోమారామ ఆలయం(ప.గో), తాడిపత్రి రామలింగేశ్వరస్వామి (అనంతపురం), కుమారారామం కుమారభీమేశ్వర స్వామి ఆలయం(కాకినాడ), భైరవకోన దేవాలయం(ప్రకాశం).