News January 11, 2025
వెలుగులోకి కొత్త మోసం.. ప్రెగ్నెంట్ చేస్తే ₹10లక్షలు!

‘ప్రెగ్నెంట్ సర్వీస్’ పేరిట బిహార్లోని నవాదా జిల్లాలో ఓ ముఠా స్కామ్కు తెరలేపింది. పిల్లల్లేని మహిళల్ని గర్భవతులను చేస్తే ₹10లక్షలు, ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైనా ₹50,000-₹5L ఇస్తామని ఆ ముఠా సభ్యులు పలువురిని నమ్మించారు. ఆధార్, పాన్, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేవారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Similar News
News February 6, 2026
ఢిల్లీ క్యాపిటల్స్కు హార్ట్ బ్రేక్

గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని నానుడి. DCకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టుకు అన్నిసార్లు పరాభవమే ఎదురైంది. నిన్నటి మ్యాచులో బ్యాటర్లు రాణించినా బౌలర్లు తేలిపోవడంతో ప్రత్యర్థి విజేతగా నిలిచింది. దీంతో WPL ట్రోఫీ గెలిచేందుకు ఆ జట్టుకు మరో సీజన్ వరకు ఎదురుచూపులే మిగిలాయి. IPLలోనూ ఇంతవరకు DC టైటిల్ గెలవకపోవడం తెలిసిందే.
News February 6, 2026
AA22: నెగటివ్ రోల్లో రష్మిక?

పుష్పలో అల్లు అర్జున్కు జోడీగా నటించిన రష్మిక ఇప్పుడు సరికొత్త రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22లో ఆమె నెగటివ్ రోల్లో కనిపిస్తారని చర్చ జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాల్లో నటిస్తున్నారు.
News February 6, 2026
2027 ఫిబ్రవరి 9 నుంచి ఏపీలో జనగణన: CS

APలో వచ్చే ఏడాది FEB 9 నుంచి 28 వరకు జనగణన నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ చెప్పారు. జనగణన సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట సమయంలోగా చేపట్టాల్సిన పనులపై ప్రత్యేకంగా బుక్లెట్ను రూపొందించి జిల్లాలకు పంపాలని సూచించారు. కాగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు <<18793970>>గృహాల మ్యాపింగ్<<>> జరగనుంది.


