News March 17, 2024
BRSను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

TG: బీఆర్ఎస్ తరఫున 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్కు ప్రస్తుతం నలుగురు ఎంపీలే ఉన్నారు.
Similar News
News September 8, 2025
మహాలయ పక్షాలు అంటే ఏంటి?

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.
News September 8, 2025
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం(తిరుపతి జిల్లా), శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, మహానంది నందీశ్వర ఆలయం, యాగంటి ఉమా మహేశ్వర ఆలయం(నంద్యాల), ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి(కోనసీమ), అమరేశ్వర స్వామి ఆలయం (అమరావతి), పాలకొల్లు క్షీరారామ ఆలయం, భీమవరం సోమారామ ఆలయం(ప.గో), తాడిపత్రి రామలింగేశ్వరస్వామి (అనంతపురం), కుమారారామం కుమారభీమేశ్వర స్వామి ఆలయం(కాకినాడ), భైరవకోన దేవాలయం(ప్రకాశం).
News September 8, 2025
శివుడు రాక్షసులకు ఎందుకు వరాలు ఇచ్చాడంటే?

శివుడు ఆశుతోషుడు. త్వరగా సంతోషించిపోతాడు. ఆయనకు భక్తి, నిష్ఠ, కఠిన తపస్సు అంటే ఎంతో ఇష్టం. అందుకే.. ఎవరైనా నిస్వార్థ భక్తితో, తీవ్ర తపస్సుతో ఆరాధిస్తే వెంటనే కరిగిపోతాడు. వరం ఇస్తాడు. ఓ వ్యక్తి అకుంఠిత దీక్షకు ఆయన కట్టుబడి ఉంటాడు. రాక్షసులైనా కఠోర తపస్సు చేస్తే వారి శక్తిని గౌరవిస్తాడు. అందువల్లే రావణుడు వంటి రాక్షసులకు వరాలు ఇచ్చాడు. వీటిని ఎలా వాడుకోవాలన్నది మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తాడు.