News January 11, 2025
భక్తుల మృతికి సీఎం బాధ్యుడు కాదా పవన్?: అంబటి

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ‘కలవని కల్తీ లడ్డుకు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడా? ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి సీఎం బాధ్యుడు కాదా పవన్ కళ్యాణ్?’ అని Xలో ప్రశ్నించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అంబటి తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే.
Similar News
News November 5, 2025
నవంబర్ 10-19 వరకు సమ్మేటివ్ పరీక్షలు

AP: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతులకు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, 6, 7 క్లాసులకు మ.1.15 నుంచి సా.4.15 వరకు జరుగుతాయి. 8-10 తరగతులకు ఉ.9.15 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్లో పొందుపరిచింది.
News November 5, 2025
కేసీఆర్ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు: కిషన్ రెడ్డి

TG: కాళేశ్వరంలో అవినీతికి కేసీఆర్ను PM మోదీ ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలంటూ సీఎం రేవంత్ చేసిన <<18200152>>వ్యాఖ్యలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. తాము ఎవరినీ జైలులో వేయమని, కోర్టులు వేస్తాయని తెలిపారు. KCRను జైలులో వేస్తామని తాము చెప్పలేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం NDSA నివేదికపై మాత్రమే సీబీఐ విచారణ కోరింది. గవర్నర్ తన అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.
News November 5, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.


