News March 17, 2024

ఖమ్మం : మట్టి కుండలకు భలే డిమాండ్

image

ఎండలు మండిపోతుండడంతో ప్రజలు చల్లని నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ లో నీటిని తాగడంతో అనేక సమస్యలు తలెత్తుతుండడంతో ఆరోగ్యం కోసం మట్టికుండల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ కొనుగోలు చేయలేని పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు నగరంలోని ప్రధాన వీధుల్లో వ్యాపారులు పలు రకాల కుండలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.

Similar News

News July 8, 2024

ఖమ్మం మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News July 8, 2024

మూడు పంచాయతీలుగా భద్రాచలం పంచాయతీ

image

భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లుపై గవర్నర్ రాధాకృష్ణన్ సంతకం చేశారు. బూర్గంపాడు మండలంలోని సారపాకను రెండు పంచాయతీలుగా ఆమోదించారు. ఇన్నాళ్లూ రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా మారతాయని పట్టణవాసులు భావించారు. కానీ భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా విభజించారు.

News July 8, 2024

గ్యాస్ బండ రాయితీకి తప్పని తిప్పలు

image

కొత్త సర్కారులో గ్యాస్ బండ రాయితీ వస్తుందని సంబరపడిన వినియోగదారులకు భంగపాటు తప్పడం లేదు. ఒక్కో గ్యాస్ బండకు వినియోగదారుడు సుమారు రూ.842 చెల్లిస్తున్నాడు. తర్వాత ఒకటి నుంచి ఐదు రోజుల్లో రూ.340 పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ సొమ్ము పడాలి. టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కారేపల్లి, ఇల్లెందు తదితర మండలాల్లో అది జమకావడం లేదు. ఫలితంగా ఆయా వినియోగదారులు రాయితీ సొమ్మును కోల్పోవాల్సి వస్తోంది.