News January 11, 2025
రూ.10వేల కోట్ల విలువైన భవనం.. బుగ్గిపాలు

లాస్ ఏంజెలిస్లో చెలరేగుతున్న కార్చిచ్చులో పలు ఖరీదైన భవనాలు తగలబడిన సంగతి తెలిసిందే. వాటిలో అత్యంత ఖరీదైన బిల్డింగ్ విలువ రూ.10వేల కోట్లు! లూమినార్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రసెల్ దీనికి యజమాని. 18 పడక గదులతో కూడిన రాజభవనంలాంటి ఆ బిల్డింగ్ దావానలంలో కాలి బుగ్గిపాలైంది. కాగా.. రూ.16.5 కోట్ల లాటరీ గెలుచుకున్న ఎడ్విన్ కాస్ట్రో అనే వ్యక్తికి చెందిన భవనం కూడా తగలబడిపోవడం గమనార్హం.
Similar News
News November 12, 2025
త్వరలో రూ.10వేల పరిహారం: తుమ్మల

రాష్ట్రంలో మొంథా తుఫాన్ కారణంగా లక్షా 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అత్యధికంగా నాగర్ కర్నూల్లో 23,580, వరంగల్లో 19,736 ఎకరాల నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందాన్ని పర్యటించమని కోరామన్నారు. దెబ్బతిన్న పంటలకు త్వరలోనే ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
News November 12, 2025
ఆన్లైన్లో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీ!

TG: ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి రావడంతో వచ్చే ఏడాది నుంచి సీట్ల భర్తీని ఆన్లైన్ విధానంలో చేయాలని చూస్తోంది. దీంతో విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకోవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30వేలకు పైగా మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి.
News November 12, 2025
‘ఉరి’ని తొలగించడంపై SCలో JAN 21న విచారణ

నేరాలకు విధించే మరణశిక్షలో ఉరితీసే పద్ధతిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 2026 జనవరి 21కి వాయిదా వేసింది. ఎక్కువ బాధను కలిగించే ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్, విద్యుత్ షాక్ తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పిటిషనర్ కోరారు. అయితే విచారణ వచ్చే ఏడాది చేపట్టాలన్న అటార్నీ జనరల్ వెంకటరమణి విజ్ఞప్తితో SC వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.


