News March 17, 2024
YELLOW ALERT.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

TS: పలు జిల్లాల్లో రేపు ఉ.8.30 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, KMR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, KMM, NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లో 30-40KM వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంది. అటు NZB, జగిత్యాల, సిరిసిల్ల, VKB, SRD, MDK, KMRD జిల్లాల్లో వర్షాలు, వడగండ్లు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
Similar News
News April 1, 2025
STOCK MARKETS: కొనసాగుతున్న బ్లడ్ బాత్

దేశీయ స్టాక్ మార్కెట్స్లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1428 పాయింట్లు కోల్పోయి 75,986 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 372Pts నష్టంతో 23,147 వద్ద కొనసాగుతోంది. IT, రియాల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు పతనమయ్యాయి.
News April 1, 2025
రేపు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రెస్ మీట్లో వెల్లడించారు. రేపు క్వశ్చన్ అవర్ పూర్తైన తర్వాత బిల్లు చర్చకు వస్తుందన్నారు. 8 గంటల పాటు చర్చించేందుకు నిర్ణయించామని, అవసరమైతే సమయం పెంచుతామని తెలిపారు. బిల్లు గురించి వివరిస్తూ దాని ప్రయోజనాలను వెల్లడించారు. మతపరమైన సంస్థల్లో బిల్లు ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.
News April 1, 2025
కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చేటని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సెంటర్లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పానీయాల్లో అధికంగా ఉండే సుక్రోజ్తో శరీరానికి ప్రమాదమేనని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. అధిక శాతం సుక్రోజ్ ఉండే పానీయాలతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.