News March 17, 2024

NGKL: కాపురానికి రావట్లేదని భార్యను చంపేశాడు

image

కోడేరు మండలం రాజాపూర్‌లో <<12867361>>భార్య గొంతుకోసి భర్త సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. తుర్కదిన్నెకు చెందిన శివశంకర్‌, భారతిని 2వ పెళ్లి చేసుకొని HYDలో ఉంటున్నాడు. 3నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భారతిని కాపురానికి రావాలని ఫోన్లో అడగ్గా రాకపోవడంతో నిన్న రాజాపూర్ వెళ్లాడు. అత్తమామలు బయటకు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు గొడవ పడి భారతి గొంతు కోసేశాడు. అనంతరం వెళ్లి తన పొలంలో ఉరేసుకున్నాడు. భారతి 6నెలల గర్భిణి.

Similar News

News January 26, 2026

మహబూబ్‌నగర్: పరేడ్ మైదానంలో పతాకావిష్కరణ

image

మహబూబ్‌నగర్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ అమలు స్ఫూర్తితో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

News January 25, 2026

MBNR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కరపత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. గత రెండేళ్లలో ఇక్కడి విద్యార్థులు 94 ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన SC, ST, BC అభ్యర్థులు ఈనెల 30లోగా www.tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News January 24, 2026

మహబూబ్‌నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.