News March 17, 2024

సూర్యాపేట: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండపురిలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న రోజు మాదిరి కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 6, 2026

మునుగోడు: విద్యాశాఖ అధికారులకు పట్టని గోడు

image

మునుగోడు మండలం పలివెల జడ్పీ హైస్కూల్‌లో విద్యాశాఖ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడు లేకపోవడంతో బోధన పూర్తిగా నిలిచిపోయింది. పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ, పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, వెంటనే టీచర్‌ను నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News February 6, 2026

NLG: చేపా.. చేపా.. ఎక్కడికెళ్లావ్‌ ?

image

NLG జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఏటా సుమారు 5 కోట్లకు పైగానే చేపపిల్లలు వదులుతున్నారు. పుష్కలంగా మత్స్య సంపద దొరుకుతుందని అందరూ అనుకుంటున్నా జిల్లాలో నేడు కొందామంటే చేపలు దొరకని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున చేపపిల్లలు ఉచితంగానే పంపిణీ చేస్తున్నా.. అందులో ఎక్కువ శాతం నాసిరకం పిల్లలను పంపిణీ చేస్తున్నారని మత్య్సకారులు తెలిపారు.

News February 6, 2026

నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా: మంత్రి

image

నల్గొండ పట్టణాన్ని అన్ని హంగులతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. శుక్రవారం 4, 5 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ కేశరాజుపల్లి నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. నల్గొండ భవిష్యత్తును అందరం కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు.