News January 12, 2025

MBNR: విద్యా నిధికి రూ.4,95,211 సాయం

image

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా నిధి పథకానికి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి రూ.4,95,211ల చెక్కు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం సాయంత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పదని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్ నగర్ రుణం తీర్చుకునే ఆకాశం వచ్చిందని అన్నారు.

Similar News

News September 14, 2025

GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

image

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.

News September 14, 2025

MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News September 14, 2025

మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో డీకే అరుణ

image

తిరుప‌తి వేద‌కగా ఆదివారం ప్రారంభ‌మైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంట్ పరిధిలో మహిళా సాధికారత, 10 అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, మహిళ 7 ఆత్మగౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యలు, ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చించడం జరుగుతుందన్నారు.