News January 12, 2025

తూ.గో: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

image

రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తూ.గో.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్న వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందేలు కోసం ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశారు. అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Similar News

News December 28, 2025

పథకాల అమలుకు సిటిజన్ ఈకేవైసీ తప్పనిసరి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలనే లక్ష్యంతో జిల్లాలో Citizen e-KYC ప్రక్రియను చేయించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రజల భాగ స్వామ్యంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 1,48,969 Citizen e-KYCలు ఉండగా, ఇప్పటి వరకు 43,306 మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 1,05,663 పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

News December 28, 2025

రాజమండ్రి: జనవరి 5న రేషన్ బియ్యం బహిరంగ వేలం

image

జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన 33.85 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జనవరి 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ ఆదివారం ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద గల పౌరసరఫరాల కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. జనవరి 3న నమూనాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. 6ఏ కేసులు ఉన్నవారు ఈ వేలానికి అనర్హులని స్పష్టం చేశారు.

News December 28, 2025

‘అఖండ గోదావరి’.. ‘తూర్పు’ వెలుగులకి రాదారి!

image

2025లో తూర్పుగోదావరి జిల్లా మౌలిక, పర్యాటక రంగాల్లో నూతన జవజీవాలను సంతరించుకుంది. రాజమండ్రిని ప్రపంచ పర్యాటక చిత్రపటంపై నిలిపే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లతో అంకురార్పణ జరగడం ఈ ఏడాది అతిపెద్ద ముందడుగు. రూ.350 కోట్లతో ఆధునికీకరించిన రాజమండ్రి విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడం, గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది వేశాయి.