News March 17, 2024

NZB: నలుగురు కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు

image

కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ పదవుల్లో NZB జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు పొందారు. అనిల్ ఈరవత్రి (మినరల్ డెవలప్‌మెంట్), మానాల మోహన్ రెడ్డి(కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), అన్వేశ్ రెడ్డి(సీడ్స్ డెవలప్‌మెంట్). వీరితో పాటు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజు (ఆర్గో ఇండస్ట్రీస్) లభించింది.

Similar News

News April 2, 2026

నిజామాబాద్: ప్రగతి వేదికగా గ్రామసభ

image

జిల్లావ్యాప్తంగా నేడు నిర్వహించే 545 గ్రామసభలు పల్లెల సమగ్ర అభివృద్ధికి దిక్సూచి కావాలి. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పనులపై ప్రజల భాగస్వామ్యంతో చర్చలు జరగడం అత్యవసరం. కేవలం మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా, పారదర్శక నిర్ణయాలకు ఇవి వేదికలు కావాలి. గ్రామాల సమస్యలను గుర్తించి, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ద్వారానే పల్లెలు ఆదర్శంగా తీర్చిదిద్దబడతాయి. ప్రతి పౌరుడు ఇందులో పాల్గొనాలి.

News April 1, 2026

NZB: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్ల అందజేత

image

నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్లను, హోర్డింగులను అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వాటిని ఇచ్చారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా బారికేడ్లు, హోర్డింగులు అందజేయడం అభినందనీయమన్నారు.

News April 1, 2026

NZB: కొండగట్టు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?: కవిత

image

కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడిన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విచారం వ్యక్తం చేశారు. హనుమాన్ జయంతి వేడుకల కోసం నాసిరకంగా పందిళ్లు వేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొండగట్టు అంజన్న ఆలయంలో ఉత్సవాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.