News January 12, 2025
‘రిపబ్లిక్ డే’ ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు?

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించాలని భారత సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో పీఎం మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. సుబియాంటో గత ఏడాది అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతల్ని స్వీకరించారు. నిరుడు రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
Similar News
News September 7, 2025
అమరావతికి వచ్చి చూస్తే తెలుస్తుంది: నారాయణ

AP: రాజధాని అమరావతిలో భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. IAS అధికారుల టవర్లు త్వరలోనే పూర్తవుతాయన్నారు. రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి మునిగిపోయిందని, పనులు జరగట్లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇక్కడకు వచ్చి చూస్తే ఎంత మంది, ఎన్ని కంపెనీలు పని చేస్తున్నాయో తెలుస్తుందన్నారు.
News September 7, 2025
చంద్రగ్రహణం వేళ చదవాల్సిన మంత్రాలు

ఈరోజు రాత్రి చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ సమయంలో ‘ఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః’ అనే మంత్రాన్ని జపిస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘మహా మృత్యుంజయ మంత్రం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. శివారాధన చాలా శక్తిమంతమైనది. ఓం నమః శివాయ అనే మంత్రం రాహు-కేతువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గం గణపతయే నమః మంత్రాలు కూడా ప్రతికూల శక్తులను తొలగిస్తాయి’ అని అంటున్నారు.
News September 7, 2025
ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

TG: హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.