News March 17, 2024
మంచిర్యాల: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి

మంచిర్యాలలోని లక్ష్మీ నగర్లో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న వహిదా అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. సోమవారం తలనొప్పి ఉన్నట్లు ప్రిన్సిపల్కి చెప్పినా పట్టించుకోలేదని, పరిస్థితి విషమించడంలో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం HYDలోని నిమ్స్కి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 5, 2025
ADB: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శశికళ

ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పిప్పర్ వాడ జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ జి.శశికళ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈనెల 5న హైదరాబాద్లో ఆమె అవార్డు అందుకొనున్నారు. విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంచడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులుగా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎంపికైన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 4, 2025
ADB: 7న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం

ప్రముఖ తత్వకవి ఉదారి నాగదాసు స్మారక కవితా అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి కరీంనగర్ వాసి తోట నిర్మలారాణికి అవార్డును కమిటీ ప్రకటించిందని నిర్వాహకులు డా.ఉదారి నారాయణ తెలియజేశారు. ఈ అవార్డును సెప్టెంబర్ 7న జిల్లా పరిషత మీటింగ్ హాల్లో మద్యాహ్నం మూడు గంటలకు అవార్డు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు కింద రూ.5 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 4, 2025
ఉపాధ్యాయుల పాత్ర కీలకం : ADB కలెక్టర్

ఒక వ్యక్తి ఉన్నతస్థానానికి ఎదగడంలో, భవిష్యత్తుకు పునాదులు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉన్నతస్థాయికి చేరాలంటే గురువు అవసరం తప్పనిసరని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తగిన గౌరవాన్ని ప్రభుత్వం ఇస్తోందని, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏఐ ద్వారా బోధించేలా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.