News January 12, 2025
పాపాలు పోగొట్టుకొనేందుకే కుంభమేళాకు వెళ్తారు: కాంగ్రెస్ నేత

ప్రజలు తమ పాపాలు కడుక్కొనేందుకే గంగలో మునుగుతారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. అందుకే వారంతా ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాకు వెళ్తారని పేర్కొన్నారు. వారి కోరికలు స్వార్థమైనవని అన్నారు. దీంతో ఆయనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎంఐఎం, ఇప్పుడు కాంగ్రెస్ కుంభమేళాను అవమానించాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడూ ఇంతేనని అంటున్నాయి.
Similar News
News November 11, 2025
రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి
News November 11, 2025
రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: TDP

AP: టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని TDP ట్వీట్ చేసింది. దాని విలువ రూ.240.80 కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల కుంభకోణం జరిగినట్లు వివరించింది. ‘ఇందులో జగన్ వాటా ఎంత? జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత? అసలు ఇది కమీషన్ కోసమే జరిగిందా? ఇంకేదైనా కుట్ర ఉందా?’ అని ట్వీట్ చేసింది. రెండేళ్ల పాటు లడ్డూ పవిత్రత దెబ్బతిందని, ఇది పాపం కాదా? అని ప్రశ్నించింది.
News November 11, 2025
IIIT కళ్యాణిలో ఉద్యోగాలు

<


