News January 12, 2025

బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ

image

AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.

Similar News

News January 11, 2026

MLAపై మూడో రేప్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు

image

కేరళ MLA రాహుల్ మాంకూటతిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు రేప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పాలక్కాడ్‌లోని ఒక హోటల్‌లో ఆయన్ను పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని సదరు మహిళ ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించింది.

News January 11, 2026

టెన్త్ అర్హతతో YSR కడప జిల్లాలో ఉద్యోగాలు

image

AP: <>YSR <<>>కడప జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, క్యాన్సర్ కేర్ సెంటర్‌లో 34 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అటెండెంట్, MNO, FNO, స్ట్రెచర్ బాయ్ పోస్టులు ఉన్నాయి. టెన్త్ పాసై, 42ఏళ్లలోపు గలవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, BC, EWS అభ్యర్థులకు రూ.250. జీతం నెలకు రూ.15వేలు చెల్లిస్తారు. https://kadapa.ap.gov.in/

News January 11, 2026

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

image

ఇరాన్‌లో నిరసనలు తీవ్రమవుతున్న వేళ ఆ దేశంలో సైనిక చర్య చేపట్టే అవకాశాలపై ట్రంప్‌కు అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారని NYT పేర్కొంది. టెహ్రాన్‌లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, కీలక నేతల సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను టార్గెట్ చేస్తూ దాడులు చేసే ఆప్షన్స్‌ను పరిశీలించారని తెలిపింది. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని, US వారికి సాయం చేయడానికి రెడీగా ఉందని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.