News March 17, 2024

ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ సిక్తా పట్నాయక్

image

ప్రజావాణి కార్యక్రమాన్ని పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేస్తున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహిస్తామన్నారు.

Similar News

News July 8, 2024

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌‌గా ప్రకాష్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌‌గా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ కార్పొరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకాశ్ రెడ్డి చెప్పారు.

News July 8, 2024

ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేష‌న్ ఛైర్మన్‌గా రాఘవరెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర కో-ఆప‌రేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేషన్‌గా జంగా రాఘ‌వరెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, రాష్ట్ర కో-ఆప‌రేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేషన్ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవరెడ్డి చెప్పారు. నూతన కార్పొరేషన్ ఛైర్మన్‌ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 8, 2024

రాజన్న నీవు దూరమైన నీ సాహసం చెరగని సంతకం: మంత్రి కొండా

image

రాజన్న నీవు దూరమైనా.. నీ సాహసం చెరగని సంతకం, నీ ప్రస్థానం మరువని జ్ఞాపకం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రతి తెలుగు వాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.