News January 12, 2025
మాజీ ఎంపీ జగన్నాథం కన్నుమూత

TG: నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్గా సేవలందించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో TDP, 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో BRS తరఫున పోటీ చేసి ఓడిన ఆయన 2024లో BSPలో చేరినా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
Similar News
News September 16, 2025
కవిత రాజీనామా ఆమోదంపై సస్పెన్స్!

TG: బీఆర్ఎస్ మాజీ నేత కవిత MLC పదవికి రాజీనామా చేసి 2 వారాలు కావొస్తుంది. ఇప్పటికీ ఆమె రాజీనామాకు శాసనమండలి చైర్మన్ సుఖేందర్ ఆమోదం తెలపలేదు. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రాజీనామా ఆమోదంపై ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ లోపు కవితను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
News September 16, 2025
దీర్ఘకాలిక సంతోషానికి ఈ అలవాట్లు

* రోజూ 30 ని.ల పాటు సాధారణ వ్యాయామం (నడక, యోగా, సైక్లింగ్) చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్లు పెరుగుతాయి.
*7-9 గంటల నాణ్యమైన నిద్ర వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తి మెరుగై, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ధ్యానం చేయాలి.
* కుటుంబం, స్నేహితులు, సమాజంతో సమయం గడపడం వల్ల దీర్ఘకాలిక సంతోషాన్ని పొందవచ్చు.
* ఇతరులకు సహాయం చేయడం వల్ల పొందే సంతోషం, తమ కోసం ఖర్చు చేయడం కంటే ఎక్కువ కాలం ఉంటుంది.
News September 16, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.1,02,600 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,44,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.