News January 12, 2025
ఈ నెలలో ₹22,194 కోట్ల FPIల ఉపసంహరణ

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(FPI) విక్రయాల పర్వం కొనసాగుతోంది. 2024 DECలో ₹15,446Cr వాటాలను కొనుగోలు చేయగా, ఈ నెల 10 నాటికి ఏకంగా ₹22,194Cr కోట్లను ఉపసంహరించుకున్నారు. US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. అధిక ద్రవ్యోల్బణం, GDP వృద్ధి తగ్గుదల కూడా నిధుల తరలింపునకు ఓ కారణం.
Similar News
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.