News January 12, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగీ పండుగ నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. విశాఖ నగర ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 5, 2025
రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే..
రాయగడ డివిజన్ పరిధిలో <<15366937>>రైల్వే లైన్లు<<>> రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్ రైల్వేస్టేషన్ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.
News February 5, 2025
KGHలో రౌడీషీటర్ హల్చల్
విశాఖ కేజీహెచ్లో రౌడీషీటర్ బుధవారం హల్చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్లైన్ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
News February 5, 2025
గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్
గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్కు తరలించామన్నారు.