News January 13, 2025

రూ.582 కోట్లతో తెలంగాణ ప్రభుత్వ స్టార్ హోటల్.. త్వరలో నిర్మాణం!

image

TG: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ ట్రేడ్‌ సెంటర్‌‌తో కూడిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను నిర్మించనుంది. 3 ఎకరాల్లో ₹582 కోట్లతో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. వరల్డ్‌లోనే టాప్-10లో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డ్ చేయనుంది. ఇప్పటికే బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. 36 నెలల్లో హోటల్‌ను అందుబాటులోకి తేవాలని పేర్కొంది.

Similar News

News November 8, 2025

NEEPCLలో 98 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NEEPCL)లో 98 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: neepco.co.in/

News November 8, 2025

జిల్లేడు పూలతో గణపతి పూజ ఎందుకు చేయాలి?

image

గణపతి పూజలో జిల్లేడాకు, పూలు చాలా కీలకం. ఇవి సకల శుభాలకు మూలమని నమ్మకం. వీటితో గణపతిని ఎలా పూజించాలో పండితులు ఇలా వివరిస్తున్నారు. పీటను శుభ్రం చేసి, బియ్యప్పిండి ముగ్గేసి, గంధం, బొట్లు పెట్టి, 21 జిల్లేడాకులను అమర్చాలి. వాటి నడుమ గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆయనకెంతో ఇష్టమైన జిల్లేడు పూల మాల వేసి, ఆ పూలతోనే పూజ చేయాలి. ఇలా ఆయనను పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడని, శుభం చేకూరుస్తాడని నమ్మకం.

News November 8, 2025

దేశంలోనే మొదటి పురోహితురాలు

image

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.