News January 13, 2025
బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. ఎక్కడంటే?

యువ బ్రాహ్మణ దంపతులకు MP ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఆఫర్ ప్రకటించింది. నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ఆ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. ‘మనం కుటుంబాలపై దృష్టి పెట్టట్లేదు. యువత ఒక బిడ్డతోనే ఆగిపోతోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 1, 2025
ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్పుట్స్తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.
News November 1, 2025
సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT
News November 1, 2025
తిరుమల కొండపై విశేష పర్వదినాలు

నవంబర్ 1: ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ
నవంబర్ 9: కార్తీక వన భోజనం
నవంబర్ 15: సర్వ ఏకాదశి
నవంబర్ 17: ధన్వంతరి జయంతి
నవంబర్ 18: మాస శివరాత్రి
నవంబర్ 25: తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం


