News March 17, 2024
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710672095678-normal-WIFI.webp)
ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కాగా, త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
Similar News
News July 8, 2024
గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416024568-normal-WIFI.webp)
భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
News July 8, 2024
ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420166154-normal-WIFI.webp)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
News July 8, 2024
ఖమ్మం మార్కెట్లో పెరిగిన మిర్చి ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720410973396-normal-WIFI.webp)
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.