News January 13, 2025
కూటమి ప్రభుత్వంలో సంతోషంతో ప్రజలు: మంత్రి పార్థసారథి

AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తమకు స్వేచ్ఛ లభించిందని వారు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లిస్తున్నామని, రోడ్లకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ సమస్యలు.. ఎలా?

ఆల్కహాల్ అలవాటులేని వారికి లివర్ ప్రాబ్లమ్స్ రావనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య సిటీల్లో చాలామంది ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ (NAFLD) బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని ఉండటం, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల లివర్లో కొవ్వు పేరుకుపోతోంది. బరువు తక్కువగా ఉన్నా ఈ సమస్య రావొచ్చు. దీన్ని ‘లీన్ ఫ్యాటీ లివర్’ అంటారు. వాకింగ్, మంచి ఆహారంతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
News April 20, 2026
ఇండియా ఆఫర్ను తిరస్కరించా: రషీద్ ఖాన్

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.
News April 20, 2026
ఇరాన్ షిప్ను స్వాధీనం చేసుకున్నాం: ట్రంప్

హార్ముజ్ జలసంధిలో తమ దిగ్బంధనాన్ని దాటుకొని వెళ్లేందుకు యత్నించిన ఇరాన్ నౌక ‘టౌస్కా’ను స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వార్నింగ్స్ ఇచ్చినా వినకపోవడంతో తమ నేవీ రంగంలోకి దిగినట్లు చెప్పారు. తమ USS Spruance డెస్ట్రాయర్ ద్వారా ఇరాన్ షిప్ ఇంజిన్రూమ్పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ స్వాధీనంలో ఉన్న ఆ నౌకలో ఏముందో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


