News March 17, 2024

నల్గొండ: పట్టభద్రుల ఓటర్లు 5,06,527 మంది

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News September 5, 2025

NLG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి టోల్ ఫ్రీ నంబర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి 18005995991 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ బిల్లుల వివరాలు తెలుసుకునేందుకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.

News September 5, 2025

నల్గొండ జిల్లాలో 15 సంఘాలకు గ్రీన్ సిగ్నల్

image

NLG జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14తో PACSల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 42 PACSలు ఉన్నాయి. ప్రస్తుతం PACSల పనితీరు ఆధారంగా 15 సంఘాల పాలకవర్గాల పదవీ కాలాన్ని మాత్రమే పొడిగించారు. మరో 15 సంఘాల పదవీ కాలాన్ని వాటి పనితీరు ఆధారంగా ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు డీసీఓ సిబ్బంది తెలిపారు.

News September 4, 2025

NLG: ఉత్తమ ఉపాధ్యాయులుగా 208 మంది ఎంపిక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 208 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుక్రవారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు.