News March 17, 2024
PHOTO: ఒకే ఫ్రేమ్లో మోదీ, చంద్రబాబు, పవన్
AP: చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న సభా వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరంతా ఒకే ఫ్రేమ్లో కనిపించారు.
Similar News
News July 5, 2024
చిన్ననాటి కోచ్తో కోహ్లీ.. ఫొటోలు వైరల్
ముంబైలో టీ20 వరల్డ్కప్ సెలబ్రేషన్స్ తర్వాత విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను రాజ్కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘విరాట్.. నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ నుంచి ఇంత గొప్ప సక్సెస్ సాధించే వరకూ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు ఇలాగే విజయవంతంగా కొనసాగాలి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
News July 5, 2024
అసలు కథ అంతా సీక్వెల్లోనే: నాగ్ అశ్విన్
‘కల్కి 2898ఏడీ’ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. అశ్వత్థామ, కర్ణుడు, సుప్రీం యాస్కిన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, ఈ పాత్రల అసలు కథంతా సీక్వెల్లోనే ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ‘ఆ ముగ్గురి మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలక పాత్ర పోషించనుంది. సీక్వెల్కు సంబంధించి నెల రోజులు షూట్ చేశాం. బాగా వచ్చింది. ఇంకా తీయాల్సి ఉంది. వీటిలో భారీ యాక్షన్ సీక్వెన్సులుంటాయి’ అని పేర్కొన్నారు.
News July 5, 2024
కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈనెల 18 వరకు రిమాండ్ను పొడిగించింది.