News March 17, 2024

వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధాన కార్యదర్శిగా: మానుపాటి నవీన్

image

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధానకార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మానుపాటి నవీన్‌ను నియమిస్తూ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. నవీన్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిజన సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన జగన్‌కు కృత్ఞలు తెలిపారు.

Similar News

News January 8, 2026

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.

News January 8, 2026

కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి

image

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం గృహ నిర్మాణం పురోగతిపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

News January 8, 2026

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

రానున్న వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో అన్ని సమ్మర్ స్టోరేజీ చెరువులను నింపినట్లు చెప్పారు.