News March 17, 2024
వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధాన కార్యదర్శిగా: మానుపాటి నవీన్

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధానకార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మానుపాటి నవీన్ను నియమిస్తూ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. నవీన్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిజన సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన జగన్కు కృత్ఞలు తెలిపారు.
Similar News
News March 31, 2025
అవనిగడ్డ: హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి వైపు నుంచి మోపిదేవికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 31, 2025
కోడూరు: బాలికపై అనుచిత ప్రవర్తన..పోక్సో కేసు నమోదు

కోడూరులో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వరికూటి వేణు అనే వ్యక్తి, బాలిక ఇంట్లో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించగా, భయంతో బాలిక బయటకు పరుగెత్తింది. ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో పెద్దలు రంగ ప్రవేశం చేశారు. అయితే, 2 రోజుల పాటు విషయం బయటకు రాకుండా చూసిన పెద్దలు, చివరికి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది.
News March 31, 2025
కృష్ణా: నేటి ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే కార్యక్రమం రద్దయినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి ‘మీకోసం’ కార్యక్రమం వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.