News March 17, 2024
మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు: పవన్

AP: రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని పేర్కొన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News October 18, 2025
RTC బస్సులు స్టార్ట్ అయ్యాయ్!

తెలంగాణలో బంద్ ప్రభావం తగ్గడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో 2,600 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి మీ ప్రాంతంలో బంద్ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News October 18, 2025
కెప్టెన్సీ కోల్పోతాననే భయం ఉంది: సూర్య

కెప్టెన్సీ కోల్పోతాననే భయం తనలో ఉందని IND T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. T20లకూ గిల్ను కెప్టెన్ చేస్తారన్న ఊహాగానాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను అబద్ధం చెప్పను. భయం ఉంటుంది. అదే నాకు మోటివేషన్. హార్డ్వర్క్ చేస్తూ నిజాయతీగా ఉంటే మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేలకు గిల్ కెప్టెన్ అవడం పట్ల హ్యాపీగా ఉన్నా. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది’ అని పేర్కొన్నారు.
News October 18, 2025
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తర్జనభర్జన

AP: విశాఖలోని <<17985023>>రుషికొండ<<>> ప్యాలెస్పై వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ కాన్సులేట్లు ఏర్పాటు చేయాలని ఏపీ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సూచించింది. ఏపీ నుంచి వేలాది మంది US, UAE సహ పలు దేశాల్లో నివసిస్తున్నందున NRI సేవలు సులభమవుతాయంది. లేకుంటే అంతర్జాతీయ హోటళ్లు నెలకొల్పాలని పేర్కొంది. దాదాపు ₹500 Crతో కట్టిన ఈ ప్యాలెస్ వినియోగం లేకపోగా, నిర్వహణ ఖర్చులకు నెలకు ₹25లక్షలు అవుతోంది.