News January 14, 2025

ఐకానిక్ చిత్రం స్థానంలో ‘కర్మ క్షేత్ర’.. సమర్థించుకున్న ఆర్మీ చీఫ్

image

1971 వార్‌లో పాక్ ఆర్మీ లొంగుబాటు సందర్భంగా తీసిన పిక్చర్‌ వెరీ ఫేమస్. న్యూఢిల్లీ రైసీనా హిల్ ఆఫీస్‌లో ఉన్న ఆ ఫొటో స్థానంలో ‘కర్మ క్షేత్ర’ పెయింటింగ్‌‌ను ఉంచడాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర సమర్థించుకున్నారు. ‘ఆర్మీలో జనరేషన్ల మార్పును సూచిస్తూ కల్నల్ థామస్ దీన్ని రూపొందించారు’ అని తెలిపారు. ‘దేశ విలువలు, ధర్మాన్ని రక్షించే పాత్రలో సైన్యం, టెక్నాలజీని ఇది ప్రతిబింబిస్తుంది’ అని ఆర్మీ పేర్కొంది.

Similar News

News November 4, 2025

అన్నీ పండించే కాపునకు అన్నమే కరవు

image

రైతులు తమ శ్రమతో దేశం మొత్తానికి కావాల్సిన పంటలు పండించి ఆహారాన్ని అందిస్తారు. కానీ కొన్నిసార్లు వారి సొంత కష్టాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుకే సరైన తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల ఆకలి తీర్చే అన్నదాతలు తమ ప్రాథమిక అవసరాలకే కష్టపడటాన్ని ఈ సామెత తెలియజేస్తుంది. రైతు కష్టానికి తగిన గుర్తింపు, మద్దతు లభించడం లేదనే విషయాన్ని ఇది సూచిస్తుంది.

News November 4, 2025

రైతులను హేళన చేస్తారా?.. కేంద్రమంత్రి ఆగ్రహం

image

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీమా సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. PM ఫసల్ బీమాకు సంబంధించిన ఫిర్యాదులను ఆయన సమీక్షించారు. పంటల బీమా కింద రైతులకు రూ.1, రూ.5, రూ.21 వంటి మొత్తాలు పరిహారంగా చెల్లించడాన్ని తప్పుబట్టారు. అది రైతులను, పథకాన్ని హేళన చేయడమే అవుతుందని మండిపడ్డారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం అనుమతించబోదని పేర్కొన్నారు.

News November 4, 2025

శబరిమల యాత్రికులకు రూ.6కోట్లతో ఆస్పత్రి

image

శబరిమల యాత్రికుల కోసం రూ.6.12కోట్లతో కేరళ ప్రభుత్వం ఓ ఆస్పత్రిని నిర్మించబోతోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీలక్కల్ వద్ద నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో స్థానికులకూ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తామని హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భూమి కేటాయించిందని వెల్లడించారు. ఇందులో ఎమర్జెన్సీ, ICU, ECG విభాగాలుంటాయని తెలిపారు.