News March 17, 2024
జెండాలు వేరైనా.. మా అజెండా ఒక్కటే: చంద్రబాబు

AP: జెండాలు వేరైనా.. టీడీపీ, జనసేన, బీజేపీ అజెండా ఒక్కటేనని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. ఐదేళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. ఎన్నికల్లో మీరిచ్చే తీర్పే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Similar News
News August 27, 2025
US వస్తువులపై ఆధారపడటం తగ్గిద్దాం.. PMకి CTI లేఖ!

US 50% <<17529585>>టారిఫ్స్<<>>తో భారత్ ఎగుమతులపై ప్రభావంతో పాటు.. లక్షల ఉద్యోగాలు పోతాయని ‘ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ PM మోదీకి లేఖ రాసింది. లెదర్, టెక్స్టైల్స్, జ్యూవెలరీ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ట్రంప్ ఒత్తిడికి తలగ్గొద్దని, అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలంది. UK, జర్మనీ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల మార్కెట్లను ఎక్స్ప్లోర్ చేయాలని సూచించింది.
News August 27, 2025
GST రేట్స్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడా..!

GST శ్లాబులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, US టారిఫ్స్ ప్రభావం పడకుండా ఎకానమీని స్థిర పరచాలని కేంద్రం భావిస్తోంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న పరిస్థితి తలెత్తొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్నులు తగ్గేంత మేర ఉత్పత్తుల ధరలు <<17529810>>పెంచాలని<<>> బీమా, సిమెంటు సహా కొన్ని కంపెనీలు భావిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. వీటిపై కేంద్రం ముందే నిఘా పెట్టాలని నిపుణులు కోరుతున్నారు.
News August 27, 2025
కామన్వెల్త్ గేమ్స్.. బిడ్ వేసేందుకు క్యాబినెట్ ఆమోదం

2030లో భారత్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గొననున్నాయి. భారత్ బిడ్ దక్కించుకుంటే గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.