News January 15, 2025
అరవింద్ కేజ్రీవాల్కు ముప్పు: ఇంటెలిజెన్స్ సోర్సెస్

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను అలర్ట్ చేసినట్టు సమాచారం. ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ఆయనకు ముప్పు ఉందని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అటు ఆప్, ఇటు కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కేజ్రీవాల్కు Z-కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేడు హనుమాన్ మందిరంలో పూజలు చేశాక ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.
Similar News
News September 8, 2025
వెరైటీ ఆఫర్.. బరువు తగ్గితే డబ్బులు

ఉద్యోగులు ఫిట్గా ఉండేందుకు చైనాలోని Arashi Vision అనే కంపెనీ వెరైటీ విధానానికి శ్రీకారం చుట్టింది. బరువు తగ్గితే మొత్తం 1 మిలియన్ యువాన్లు (రూ.1.23 కోట్లు) రివార్డుల రూపంలో ఇస్తామని ప్రకటించింది. 500 గ్రాములు తగ్గితే రూ.6,181 ఇస్తామని తెలిపింది. ఓ ఉద్యోగి 3 నెలల్లో 20 కేజీలు తగ్గి రూ.2.46 లక్షలు గెలుచుకున్నాడు. ఈ పోటీలో పాల్గొన్న ఉద్యోగులు తిరిగి బరువు పెరిగితే 500 గ్రా.కు రూ.9,867 చెల్లించాలి.
News September 8, 2025
కుల్గాం ఎన్కౌంటర్.. ఇద్దరు సైనికుల వీరమరణం

జమ్మూకశ్మీర్లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ గడర్లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
News September 8, 2025
‘ఆమె లేని లోకంలో నేను ఉండలేను’.. ప్రియుడి సూసైడ్

TG: ప్రేయసి మరణవార్తను తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల(D)లోని పాత కొమ్ముగూడెంలో జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని హితవర్షిణి ప్రేమలో విఫలమై నిన్న SECBADలో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది. ‘నా బంగారు తల్లి లేని లోకంలో బతకలేను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా’ అంటూ లెటర్ రాసి వినయ్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.