News January 15, 2025
Stock Market: ఈ రోజు కూడా గ్రీన్లోనే

అధిక వెయిటేజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా గ్రీన్లోనే ముగిశాయి. Sensex 224 పాయింట్ల లాభంతో 76,724 వద్ద Nifty 37 PTS ఎగసి 23,213 వద్ద స్థిరపడ్డాయి. IT, రియల్టీ షేర్లు రాణించాయి. NTPC, TRENT, Power Grid, Kotak Bank, Maruti టాప్ గెయినర్స్. M&M, Axis Bank, Bajaj Finserv టాప్ లూజర్స్. Sensex 76,700 పరిధిలో, Nifty 23,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది.
Similar News
News September 12, 2025
MOSతో క్లరికల్ ఉద్యోగాలు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో క్లరికల్ కేడర్లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే కోర్సు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్(MOS). దీని ద్వారా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తదితర బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ లభిస్తాయి. దీంతో SSC నిర్వహించే CHSL, MTS రిక్రూట్మెంట్ పరీక్షల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో విజయం సాధించవచ్చు. పలు ఇన్స్టిట్యూట్లు ఈ కోర్సును ఆన్లైన్, ఆఫ్లైన్లో అందిస్తున్నాయి.
News September 12, 2025
సంతానం పొందడానికి SMEP..

ప్రస్తుత కాలంలో చాలా జంటలు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే పిల్లలు పుట్టకపోవడానికి లోపాలే కారణం అనుకుంటారు. కానీ అండం విడుదల సమయాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక కారణం. ఓవులేషన్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి కలయికలో పాల్గొంటే సక్సెస్ రేటు పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీన్నే స్పెర్మ్ మీట్ ఎగ్ ప్లాన్(SMEP) అంటారు. దీనికి అనుగుణంగా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.
News September 12, 2025
డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.