News January 15, 2025
తిరుమలలో రూ.300 టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్

AP: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన నకిలీ టికెట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ₹300 నకిలీ టికెట్లతో పలువురు దర్శనానికి వెళ్తుండగా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేక కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా ఈ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Similar News
News January 25, 2026
బృహస్పతి చంద్రుడిపై జీవం ఉందా?

బృహస్పతి (Jupiter) చంద్రుడైన యూరోపాపై ఆసక్తికరమైన ప్రక్రియ జరుగుతోంది. బరువైన ఉప్పు మంచు గడ్డలు క్రమంగా లోపల ఉన్న సముద్రాన్ని చేరుతున్నాయి. దీంతో జీవం మనుగడకు అవసరమైన ఆక్సిజన్ వంటి పోషకాలు సముద్రంలోకి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ‘సింకింగ్ ఐస్’ విధానంతో జీవం మనుగడకు అవకాశం ఉంది. నాసా 2024లో ప్రయోగించిన ‘యూరోపా క్లిప్పర్ మిషన్’ 2030కి అక్కడికి చేరుకొని రహస్యాలను వెలికి తీయనుంది.
News January 25, 2026
కళ్లు ఇలా ఉంటే కిడ్నీ సమస్యలు!

కళ్లు ఎర్రబడటం, అలసట, ఎలర్జీ, ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లూ, ఎల్లో రంగులను సరిగ్గా గుర్తించలేవు. డబుల్, బ్లర్ విజన్, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు కలుగుతాయి. కళ్లు పొడిబారడం, దురద సమస్యలు ఎదురవుతాయి. యూరిన్లో ప్రొటీన్ లీకై కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోయి ఉబ్బినట్టు కనిపిస్తాయి. యూరిన్లో నురుగు లేదా బుడగలు ఉన్నా కిడ్నీల పనితీరు సరిగ్గా లేదని గుర్తించాలి.
News January 25, 2026
విడాకులు తీసుకున్న సీరియల్ నటులు

టీవీ సీరియల్ కపుల్ అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అనూష IGలో తెలియజేశారు. పరస్పర అంగీకారంతో తాము చట్టపరంగా 2025లోనే విడిపోయామని తాజా పోస్టులో పేర్కొన్నారు. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు తదితర సీరియల్స్లో ప్రతాప్ నటించారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో అనూషతో కలిసి నటించారు. ఆ సమయంలోనే లవ్లో పడ్డారు. 2020లోనే పెళ్లి చేసుకోగా 2023 నుంచి వేరుగా ఉంటున్నారు.


