News January 15, 2025
EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్లో పొలిటికల్ వార్

MP భోపాల్లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్నాథ్ సర్కార్ కరప్షన్కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.
Similar News
News September 10, 2025
బిడ్డకు జన్మనిచ్చిన మెగా కపుల్

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. మెగా ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తేజ్-లావణ్య వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.
News September 10, 2025
మాగంటి ఫ్యామిలీకి అండగా నిలవాలి: కేటీఆర్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి అందరూ అండగా నిలవాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఓ సర్వే ప్రకారం ఇక్కడ మనదే లీడ్ అని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆ పార్టీకి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూల్చుకున్నట్లే’ అని వ్యాఖ్యానించారు. BRS అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.
News September 10, 2025
మహాలయ పక్షాల్లో ఏం చేయాలి?

మహాలయ పక్షము పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం. ఈ పదిహేను రోజులు గతించినవారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ఇది తరతరాల అనుబంధాన్ని, కృతజ్ఞతను చాటుకునే ఆధ్యాత్మిక విధిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే పిండ ప్రదానాలు, అన్నదానాలు పితృదేవతలకు సద్గతిని ప్రసాదిస్తాయి. మనకు వారి ఆశీర్వాదాలు లభించేలా చేస్తాయి. ఈ కర్మలు మనల్ని మన మూలాలకు మరింత దగ్గర చేస్తాయి.