News January 16, 2025
అసలు ఎవరీ రత్తయ్య..?

సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.
Similar News
News December 25, 2025
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు

జిల్లా సంసద్ ఖేల్ మహోత్సవ్-2025 ముగింపు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆనం కళాకేంద్రంలో మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, మారథాన్ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 25, 2025
ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News December 25, 2025
ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


