News January 16, 2025
గ్రౌండ్ స్టాఫ్కు MCA జంబో గిఫ్ట్ హాంపర్స్.. ఏమేం ఉన్నాయంటే?

వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ 178 మంది గ్రౌండ్ స్టాఫ్కు జంబో గిఫ్ట్ హాంపర్స్ అందజేసింది. ఇందులో 5 కిలోల చొప్పున గోధుమ పిండి, బియ్యం, పప్పు, ఒక మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్స్, బ్యాక్ ప్యాక్స్, కిట్ బ్యాగ్, టవల్స్, పెన్స్, నోట్ పాడ్స్, బెడ్ షీట్స్, ట్రాక్ పాంట్స్, జాకెట్స్, సన్ గ్లాసెస్, హాట్స్, రెయిన్ కోట్, అంబ్రెల్లా, సన్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.
Similar News
News November 12, 2025
GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.
News November 12, 2025
నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.
News November 12, 2025
ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

భారత్లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్లో ఉంది.


