News January 16, 2025

2 నెలల్లో ఉచిత బస్సు పథకం: మంత్రి మండిపల్లి

image

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో AP దూసుకెళ్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. తిరుపతి(D)లోని శ్రీసిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News October 27, 2025

అమ్మాయిలు గూగుల్‌లో వెతికే టాప్-5 టాపిక్స్!

image

ఇండియన్ టీనేజీ అమ్మాయిలు గూగుల్‌లో వినోదం మాత్రమే కాకుండా తమ పర్సనల్ లైఫ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పలు నివేదికల్లో తేలింది. బ్యూటీ&మేకప్(35%), ఫ్యాషన్ (25%), కొరియన్ డ్రామాలు(18%), హెల్త్&ఫిట్నెస్(12%), స్టడీస్&కెరీర్(10%) టాపిక్స్ గురించి అధికంగా శోధిస్తున్నారు. ఇక ఇతరులను అడగలేని సున్నితమైన సమస్యలకు సమాధానాల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తేలింది.

News October 27, 2025

వైద్యురాలి ఆత్మహత్య.. సంచలన ఆరోపణలు

image

MHలో సూసైడ్ చేసుకున్న <<18107450>>వైద్యురాలిపై<<>> ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ‘గతంలో నా కూతురిని ఆమె భర్త అజింక్య(ఆర్మీ ఆఫీసర్), అత్తింటివాళ్లు చంపేశారు. కానీ సూసైడ్ చేసుకుందని లేడీ డాక్టర్ ఫేక్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చింది. ఆమెను ఎవరో ఒత్తిడి చేసినందుకే ఈ పని చేసింది. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా SI గోపాల్‌తో పాటు ఓ MP తనను వేధించారంటూ సదరు వైద్యురాలు సూసైడ్ నోట్‌లో రాసిన విషయం తెలిసిందే.

News October 27, 2025

11AMకు లక్కీ డ్రా.. అదృష్టం ఎవరిని వరించేనో?

image

TG: మద్యం షాపులకు ఇవాళ 11AMకు అన్ని జిల్లాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్లు లక్కీ డ్రా తీయనున్నారు. 2,620 మద్యం షాపులకు 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ.3 లక్షలు ఉన్నప్పటికీ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్క షాపు తగిలినా లైఫ్ సెట్ అవుతుందనే ఉద్దేశంతో పలువురు పదుల సంఖ్యలో అప్లికేషన్స్ పెట్టారు. మరి ఎవరి లక్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. మీరూ అప్లై చేశారా?