News January 16, 2025
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో సంఘం ఛైర్మన్ను నియమించనుంది. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 JAN 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. అటు స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.3,985 కోట్లతో మూడో స్పేస్ లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేయనుంది.
Similar News
News November 4, 2025
RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 4, 2025
వాము పంట సాగు- అనువైన రకాలు

వాము పంటను ఏ నేలలోనైనా, ఏ వాతావరణంలోనైనా సాగు చేయవచ్చు. నల్లరేగడి నేలలో బాగా పండుతుంది. గుంటూరు లామ్ విడుదల చేసిన L.S-1, LTA-26, లామ్ వర్షా రకాలు మంచి దిగుబడినిస్తాయి. వాము పంటకాలం 150-160 రోజులు. వీటిలో లామ్ వర్షా బెట్ట పరిస్థితులను తట్టుకొని ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. వాము పంట అధిక తేమ, నీటి ముంపును తట్టుకోలేదు. లోతట్టు నేలలు వాము సాగుకు అనుకూలం కాదు. మురుగునీటి వసతి ఉండాలి.
News November 4, 2025
నష్టాలను పూడ్చే గరిక నీటి అభిషేకం

వినాయకుడికి గరిక ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాంటి గరిక కలిపిన నీటితో శివ లింగానికి అభిషేకం చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. గరిక నీటితో శివుడికి అభిషేకం చేయడం వల్ల నష్టపోయినదంతా తిరిగి పొందుతారని అంటున్నారు. ‘ఈ అభిషేకానికి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకునే శక్తి కూడా ఉంటుది. జీవితంలో ఎదురైన ఆటంకాల నుంచి బయటపడి, పూర్వ వైభవం పొందడానికి ఈ అభిషేకం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.


