News January 17, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రుద్రంగి మండలంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్లాపూర్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో తప్పిపోయిన మహిళ. @ గొల్లపల్లి మండలంలో బోల్తా పడిన కారు. @ జగిత్యాల లో పోలీసులకు క్రీడా పోటీల నిర్వహణ. @ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కరీంనగర్ కలెక్టర్.

Similar News

News November 3, 2025

మానకొండూరు: పాఠశాల దారి మూసేశారు..!

image

మానకొండూరు(M) గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారికి ఫెన్సింగ్ వేయడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి చదువుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉన్న దారిని ఒక్కసారిగా ఎందుకు మూసేశారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలా లేక రాజకీయ కారణాలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

News November 2, 2025

చాలా రోజుల తర్వాత కనిపించిన కెప్టెన్

image

చాలా కాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదివారం కనిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసి, బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణరావు మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

News November 2, 2025

KNRలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు

image

KNR జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కమాండింగ్ ఆఫీసర్ షేక్ యాకుబ్ అలీ వాయుసేనలో చేరడం ఎలా, వాయుసేనలో అవకాశాలు ఎలా ఉంటాయి, పరీక్ష విధానం, సిలబస్, పూర్తి సెలక్షన్ వివరాలను అభ్యర్థులకు వివరిస్తారని తెలిపారు. ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.