News March 17, 2024
పాడేరు: మోదకొండమ్మ జాతరకు తేదీలు ఖరారు

మన్యం ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించడానికి ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్ళి సింహాచలం నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగుళ్ళి ఉషారాణి అధ్యక్షతన ఆదివారం అమ్మవారి ఆలయంలో పురోహితులు సుబ్రహ్మణ్యశాస్త్రి ఆయా తేదీలను నిర్ణయించారు. త్వరలో ఉత్సవ కమిటీ వేయనున్నారు.
Similar News
News October 25, 2025
విశాఖలో సెలవులు రద్దు: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పెనుగాలుల ప్రమాదం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
News October 25, 2025
మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్ద మృతదేహం కలకలం

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ చేసే గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News October 25, 2025
విశాఖలో సీఐల బదిలీ: సీపీ

విశాఖలో 8మంది CIలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. 1టౌన్ సీఐ జీడి బాబును ఎయిర్ పోర్టు ప్రోటోకాల్కు, సీసీఎస్లో ఉన్న సీఐ శంకర్నారాయణను ఎయిర్ పోర్టు స్టేషన్కు, అక్కడ పనిచేస్తున్న ఉమామహేశ్వరరావును సిటీ వీఆర్కు, రేంజ్లో ఉన్న వరప్రసాద్ను వన్టౌన్ స్టేషన్కు, సీపోర్టు ఇమిగ్రేషన్లో ఉన్న శ్రీనివాసరావును వీఆర్కు, సిటీ వీఆర్లో ఉన్న రామకృష్ణ స్పెషల్ బ్రాంచ్కు బదిలీ అయ్యారు.


