News January 17, 2025
పలాస: సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. బయటకు రాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ సెలవులకు సరదాగా గడుపుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని స్థానికులు అన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News February 5, 2025
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
News February 5, 2025
పలాస: అబాకస్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
పలాస మండలం రామకృష్ణాపురంలో గల ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి మంగళవారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న గీత చరిష్మా శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని టీచర్స్ కోరారు.
News February 4, 2025
అరసవల్లి: భక్తుల రాకపోకలను పరిశీలించిన కలెక్టర్
అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.