News January 17, 2025
ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం

కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News September 19, 2025
HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?
News September 19, 2025
HYD: మ్యాన్హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

భారీ వర్షాల నేపథ్యంలో హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి PRT బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి MD అశోక్రెడ్డి ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో ఉ.6 నుంచి ఉ.9 గం. వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్హోల్ మూతలు తెరవొద్దని, ఒకవేళ తెరిచి ఉంటే HMWSSB 155313, హైడ్రా 9000113667 నంబర్లకు కాల్ చేయాలన్నారు.
News September 19, 2025
సరూర్నగర్ చెరువులో దూకి సూసైడ్

సరూర్నగర్ చెరువులో గృహిణి పోళ్ల భవాని (28) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు, భర్త మద్యపాన అలవాటు కారణంగా విభేదాలు తీవ్రస్థాయికి నెలకొన్నాయి. ఈనెల 16న సైదాబాద్ మహిళా పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ జరిగినా సమస్యలు తగ్గకపోవడంతో గురువారం సాయంత్రం చెరువులోకి దూకేసింది. మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా టీమ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని సీఐ సైదిరెడ్డి తెలిపారు.