News January 17, 2025

లింగంపేట్: యాక్సిడెంట్‌లో యువకుడి మృతి.. గ్రామస్థుల ధర్నా

image

లింగంపేట మండలం ముస్తాపూర్ తండాలో గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను మృతి చెందాడని కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Similar News

News December 31, 2025

NZB: అందరికీ విజయాలు కలగాలి: సీపీ

image

ప్రజలందరూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులకు సహకరిస్తూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ విజయాలు కలగాలన్నారు.

News December 31, 2025

NZB: జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: కలెక్టర్

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు.

News December 31, 2025

ఏటీఎంల భద్రతపై నిజామాబాద్ సీపీ సమీక్ష

image

జిల్లాలో ATM దొంగతనాల నేపథ్యంలో సీపీ సాయి చైతన్య బ్యాంక్ మేనేజర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటీఎంలో 30 రోజుల బ్యాకప్‌తో కూడిన సీసీ కెమెరాలు, అలారం, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి సమన్వయంతో నేరాలను అరికట్టాలని సూచించారు.