News January 17, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుంది: ఎంపీ కావ్య

image

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలన్నింటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Similar News

News December 28, 2025

వరంగల్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

జిల్లాలో గత ఆదివారంతో పోలిస్తే నేడు చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు చికెన్ విత్‌ స్కిన్ కేజీకి రూ.250 నుంచి రూ.270 పలకగా.. స్కిన్‌ లెస్ కేజీకి రూ.280 నుంచి రూ.300 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. ధరలు పెరగడంతో కొనుగోలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News December 28, 2025

WGL: ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తితో నగర అభివృద్ధికి బలమైన బాటలు పడతాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 27, 2025

వరంగల్‌లో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయండి: ఎంపీ

image

వరంగల్ నగరంలో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్‌కు ఆమె లేఖ రాశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజుకు 400 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్లాంట్ ఎంతో అవసరమన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాక, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులోకి వస్తుందని ఆమె వివరించారు.