News January 17, 2025
జిల్లాలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ దివాస్

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు.
Similar News
News March 2, 2026
కువైట్లో పాలకొల్లు యువకుడి మృతి

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) కువైట్ దేశంలో మృతి చెందారు. 8 నెలలు క్రితం కువైట్ వెళ్లిన రాకేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఆదివారం అనారోగ్యంగా ఉండడంతో స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కువైట్లోనే ఉంటున్న రాకేష్ తల్లి రమణకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వస్థలం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తండ్రి శ్రీనివాస్ కోరుతున్నారు.
News March 2, 2026
అక్షరాంధ్ర పరీక్షలకు అంతా సిద్ధం కావాలి: కలెక్టర్

జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెబ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూల్యాంకనకు సిబ్బందిని నియమించాలన్నారు.
News March 2, 2026
యథావిధిగా జిల్లాలో పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి

భీమవరంలోని కలెక్టరేట్తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టరు నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.


