News March 17, 2024
గుంటూరు: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్షలు

గుంటూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఉదయం జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం 8,785 మంది హాజరయ్యారు. 6,254 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 8,714 మంది హాజరయ్యారు. 6,325 మంది గైర్హజరయ్యారు. ఈ పరీక్షలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
పరిశీలించారు.
Similar News
News October 27, 2025
గుంటూరు జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పోలీస్ (24×7) కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
@జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0863-2230100
@ఈస్ట్ సబ్డివిజన్–0863-2223353
@వెస్ట్ సబ్డివిజన్– 0863-2241152 / 0863-2259301
@నార్త్ సబ్డివిజన్–08645-237099
@సౌత్ సబ్డివిజన్–0863-2320136
@తెనాలి సబ్డివిజన్–08644-225829
@తుళ్లూరు సబ్డివిజన్–08645-243265
News October 27, 2025
ANU పరిధిలోని కాలేజీలకు సెలవు

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మొంథా తుఫాను నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలకు ఈ నెల 29 వరకు మూడు రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News October 27, 2025
ANU: పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీజీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల మూడో సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లై) పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు నవంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు చెల్లింపుకు చివరి తేది నవంబర్ 3, రూ.100 జరిమానాతో నవంబర్ 6 వరకు అవకాశం. గ్యాలీలు నవంబర్ 4లోపు సమర్పించాలి. ఆన్లైన్ ద్వారా ఇంటర్నల్స్/మూక్లు/ప్రాక్టికల్ మార్కులను సమర్పించడానికి చివరి తేదీ: 15-12-2025


