News January 17, 2025

వేల్పూర్ మండలంలో అదనపు కలెక్టర్ పర్యటన

image

వేల్పూర్ మండలంలో అదనపు కలెక్టర్ అంకిత్ శుక్రవారం పర్యటించారు. మండలంలో లక్కోర గ్రామంలో కొత్త రేషన్ కార్డులు, ఆహార భద్రత కార్డుల పనితీరును ఆయన పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, భూమి వివరములను క్షుణ్ణంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకిషన్, పంచాయతీ కార్యదర్శి విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

GWL: కట్టుకున్న వారే కడతేర్చుతున్నారు!

image

జీవితాంతం కలిసుంటామని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్యాభర్తలు కట్టుకున్న వారినే కడ తేర్చుతున్నారు. నడిగడ్డలో ఇటీవల జరిగిన ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. GWLలో తేజేశ్వర్‌ను భార్య ఐశ్వర్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేయించింది. అయిజ మాలపేటలో మాజీ భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, కుమారుడికి పెళ్లి కావడంలేదని తండ్రీకొడుకులు కలిసి హత్య చేశారు. దీంతో పెళ్లిచేసుకోవాలంటేనే యువతలో భయం పుడుతోంది.

News July 5, 2025

ఆ 11 మంది ఏమయ్యారు?

image

TG: పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ఆచూకీ లభించడంలేదు. 39 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా, కనిపించకుండా పోయినవారి శరీర భాగాల్లో చిన్న ముక్క కూడా దొరకలేదు. దీంతో వారు కాలి బూడిదయ్యారా? లేక ఏమయ్యారు? అనేది తెలియడంలేదు. వారి అవశేషాల కోసం ఘటనాస్థలంలో మరోసారి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబీకులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

News July 5, 2025

KNR: రేపు జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్స్

image

సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్‌లో జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం నిర్వహించనునట్లు జిల్లా హాకి జాయింట్ సెక్రటరీ తిరున హరి శ్రీనివాస్ తెలిపారు. ఈ హాకీ ట్రయల్స్ కోసం ఆసక్తి గల జిల్లాలోని హాకీ క్రీడాకారులు తమ పేర్లను జిల్లా ఇన్ఛార్జి సెక్రటరీ అలీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7075667465, 9949029440 నంబర్లను సంప్రదించాలని కోరారు.