News March 17, 2024

గాంధారిలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 8, 2024

పిట్లం: బ్యాంక్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1కు

image

పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన దామరంచ అనిల్ గౌడ్ గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మొదట బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సివిల్స్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక అయి కొన్ని రోజుల పాటు ఎస్సైగా విధులు నిర్వహించాడు. అనంతరం గ్రూప్-2లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం ACTOగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

News July 8, 2024

నిజామాబాద్: అగ్నివీర్‌లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేన అగ్నిపథ్‌లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన యువతీ యువకులు జులై 8 నుంచి జులై 28 వరకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

News July 8, 2024

KMR: రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు అవకాశం

image

రేషన్ కార్డుల్లో చిరునామా మార్పులు, కొత్త సభ్యుల పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మీ సేవ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.