News March 17, 2024
గ్రూప్-2 ప్రిలిమ్స్.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

AP: గత నెల 25న 897 గ్రూప్-2 ఉద్యోగాలకు జరిగిన ప్రిలిమినరీ పరీక్షపై APPSC కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు. వచ్చే వారం అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రిలిమ్స్ కఠినంగా వచ్చినందున 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 11, 2025
ALERT: వచ్చే 3 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈ మూడు రోజులూ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News April 11, 2025
రాణా మావాడు కాదు: పాక్

26/11 ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గడచిన రెండు దశాబ్దాల్లో రాణా తన పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు. అతడు కెనడా జాతీయుడనేది సుస్పష్టం’ అని పేర్కొంది. మరోవైపు.. ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ISI పాత్ర ఉందన్న విషయం రాణాపై విచారణ అనంతరం బయటికొస్తుందని NIA వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
News April 11, 2025
రామ్ చరణ్ ‘పెద్ది’లో మరో సర్ప్రైజ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. లాస్ట్ షాట్లో చెర్రీ సిక్స్ కొట్టిన స్టైల్ అదుర్స్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే, మూవీలో క్రికెట్తో పాటు రెజ్లింగ్ సీన్స్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇస్తాయని టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని మేనరిజమ్స్, నటనతో చెర్రీ కట్టిపడేస్తారని అంటున్నారు. ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తయిందని, కీలక ఫైట్స్ షూట్ చేశారని సమాచారం.